శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 4: రాష్ట్రంలో పాలియేటివ్ కేర్ సేవలను విస్తృతపరిచేందుకు ప్రైవేటు భాగస్వామ్యంతో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ప్రాణాంతకమైన, సంక్లిష్టమైన వ్యా ధులకు గురైన రోగులకు, చివరిదశలో ఉన్న క్యాన్సర్ పేషెంట్లకు వైద్యసేవలందించేందుకు ఖాజాగూడలో 82 పడకలతో కొత్తగా నిర్మించిన పాలియేటివ్ కేర్ భవనాన్ని ఆయన శనివా రం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2016లో బంజారాహిల్స్లోని రోటరీక్లబ్వారి స్పర్శ్ హాస్పైస్ పాలియేటివ్ కేర్ను సందర్శించానని చెప్పారు. అప్పటివరకు పాలియేటివ్ కేర్ గురించి తనకు తెలియదన్నారు. క్యాన్సర్ బారినపడి అంత్యదశలో ఉన్నవారికి అందిస్తున్న ఆత్మీయసేవలు గొప్ప గా అనిపించాయని చెప్పారు. ప్రభుత్వం తో డ్పాటునందించి, కొంత స్థలం కేటాయిస్తే మరింత పెద్దదైన పాలియేటివ్ కేర్ కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తామని నిర్వాహకులు నా డు కోరారని గుర్తు చేశారు. ఆ మేరకు ప్రభు త్వం ఖాజాగూడాలో స్థలం కేటాయించిందని, 2017లో తానే ఈ భవన నిర్మాణానికి భూమిపూజ చేశానని చెప్పారు. ఆశయం మంచిదై దా నికి సంకల్ప బలం తోడైతే అనుకున్నది సాధించవచ్చని నిరూపించారని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఐదేండ్లలో అద్భుతమైన, అధునాతన సౌకర్యాలతో కూడిన చక్కటి భవనాన్ని అందుబాటులోకి తెచ్చారని, ఇందుకు కృషి చే సిన వారందరినీ అభినందిస్తున్నానని చెప్పా రు. ఈ భవనానికి నీరు, ఆస్తి పన్నులకు మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించారు. వాక్శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి ఉంటే తప్పకుండా అనుకున్నది జరిగి తీరుతుందని సీఎం కేసీఆర్ చెప్తుంటారని, ఇందుకు ఉదాహరణ ఈ భవనం అని వ్యాఖ్యానించారు.
బంజారాహిల్స్ రోటరీక్లబ్వారికి పాలియేటివ్ కేర్ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ స్కూల్ సమీపంలో 1.1 ఎకరాల భూమిని 33 ఏండ్ల లీజుకింద కేటాయించింది. ఆ స్థలంలో రూ.15 కోట్లతో 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 82 పడకల సామర్థ్యంతో నూతన భవనాన్ని నిర్మించారు. కార్యక్రమంలో రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ మహేశ్ కోట్బాగీ, రోటరీ క్లబ్ బంజరాహిల్స్ అధ్యక్షుడు వికాస్ రంకా, రాష్ట్ర ఐటీశాఖ కార్యదర్శి జయేశ్రంజన్, డీజీపీ మహేందర్రెడ్డి, స్పర్శ్ హాస్పైస్ సీఈవో రాంమోహన్రావు, దాతలు పాల్గొన్నారు.