నిమ్స్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు హామీ
చౌటుప్పల్, జూన్ 19: పది నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించేందుకు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లింగోజీగూడెం గ్రామానికి చెందిన ఎర్రంపల్లి శ్రీశైలం పది నెలల కూతురు శ్రీవిద్య కొంతకాలంగా లివర్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్లోని నిలోఫర్ దవాఖానలో చికిత్స పొందుతున్నది. అక్కడ లివర్ మార్పిడికి అవకాశం లేకపోవడంతో ఆందోళన చెందిన శ్రీశైలం.. తన స్నేహితుడు నవీన్రెడ్డి ద్వారా చిన్నారి దీనస్థితిని ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్కు విన్నవించారు. వెంటనే స్పందించిన మంత్రి సదరు చిన్నారి శ్రీవిద్యకు లివర్ మార్పిడిని నిమ్స్లో చేయించేలా భరోసా కల్పించారు. దీంతో శ్రీశైలం కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.