నిర్మల్ : కుల మతాలు, భౌతిక సంబంధాల కంటే మానవత్వమే ముఖ్యమని భావించిన కొందరు ముస్లిం యువకులు కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు జరిపించి మానవత్వాన్ని చాటారు. జిల్లాలోని కడెం మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రాఘవరెడ్డి కరోనాతో ఈ రోజు ఉదయం మరణించాడు. ఆయన దహన సంస్కారాలకు చేయడానికి బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాలేదు.
దీంతో గ్రామానికి చెందిన ఐదుగురు ముస్లిం యువకులు హిందూ సంప్రదాయ పద్ధతిలో రాఘవరెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. ముస్లిం సోదరులు చేసిన మంచి పనికి కుల, మతాలకు అతీతంగా ప్రశంసల జల్లు కురుస్తున్నది.
ఇవి కూడా చదవండి..
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
కరోనా లక్షణాలు ఉన్న అందరికి మందులు ఇవ్వండి
పోలీసుల సేవలు ప్రశంసనీయం : మంత్రి సత్యవతి రాథోడ్
టీకాల తయారీపై గడ్కరీ ప్రకటన.. కాంగ్రెస్ చురకలు