సిరిసిల్ల,/సిరిసిల్ల టౌన్ జూలై 3: చిత్తశుద్ధితో పేదల సమస్యలు పరిష్కరించే ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన ఆత్మీయతను చాటారు. డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని విన్నవించేందుకు వచ్చిన నిరుపేద మహిళలకు అభయమివ్వడమే కాకుండా అన్నం తినిపించి పంపించారు. సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు శనివారం ఉదయం సిరిసిల్లలోని తన క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ సమయంలో పట్టణంలోని సుభాష్నగర్కు చెందిన ఇద్దరు మహిళలు వేముల కవిత, సరళ అక్కడికి వచ్చి మంత్రిని కలిశారు. పర్యటన ఏర్పాట్లలో తలమునకలై ఉన్న ఆయన ఏ మాత్రం ఇబ్బంది పడకుండా వారిని ఆత్మీయంగా పలుకరించి సమస్యను సావధానంగా విన్నారు. తాము నిరుపేదలమని ఇండ్లు ఇవ్వాలని వేడుకోగా స్పందించిన ఆయన, అర్హులైతే మంజూరు చేయాలని, అవసరమైతే ఆదివారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మంజూరు పత్రాలు ఇప్పించాలని సిరిసిల్ల కమిషనర్ను ఆదేశించారు. మంత్రిని కలిసిన తర్వాత మహిళలు వెళ్లిపోతుండగా, అన్నం తిన్నారా? అని అడిగారు. లేదని వారు చెప్పగా మహిళలతోపాటు వారి పిల్లలకు భోజనం పెట్టించి పంపించారు.