బోథ్ : ఉగాది సందర్భంగా రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. భూతల్లికి పసుపు కుంకుమతో పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టారు. ప్లవనామ సంవత్సరంలో పంటలు బాగా పండాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని వేడుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని తన వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ వ్యవసాయ పనులు ప్రారంభించారు. ముందుగా ఎడ్లకు పూజలు చేశారు. అరకపట్టి కొత్త పనులకు శ్రీకారం చుట్టారు.