ముక్కోటి వృక్షార్చనలో మొక్కలు నాటిన మహేశ్ బిగాల
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు జన్మదినాన్ని అమెరికాలో ఘనంగా నిర్వహించారు. న్యూజెర్సీలో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎన్నారై విభాగం సమన్వయకర్త మహేశ్ బిగాల మొక్కలు నాటి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ, గతంలో కేటీఆర్ కూడా న్యూజెర్సీలోనే ఉన్నారని, ఇప్పుడు తెలంగాణను ప్రపంచపటంలో సమున్నతంగా నిలబెట్టడానికి ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని ముక్కోటి వృక్షార్చనగా ఎంపీ సంతోష్కుమార్ ప్రపంచవ్యాప్తం చేశారని పేర్కొన్నారు. వీడియోకాల్ ద్వారా ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గణేగోని, రవి ధన్నపనేని, శ్రీనివాస్ గన్గోని, భగవాన్ పింగ్లే, రవి తోట తదితరులు పాల్గొన్నారు.