హైదరాబాద్ : అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఈ ఘటన నల్లగొండలో మంగళవారం చోటుచేసుకుంది. అక్టోబరు 2011న మూసీ నది తీరం మోత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని యాదగిరిగుట్టలో నీలగిరి నర్సయ్య(30) అనే వ్యక్తి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రామ శివారులో ఉన్న తన పొలం వద్దకు పనుల నిమిత్తం మహిళ వెళ్తుండగా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నర్సయ్యను అరెస్టు చేశారు. విచారణ అనంతరం దోషిగా తేలిన నర్సయ్యకు కోర్టు 10 జైలు శిక్ష విధించడంతో పాటు రూ. 50 వేలు జరిమానాగా విధించింది.