న్యూఢిల్లీ: పాకిస్థాన్ నేషనల్ డే సందర్భంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు శుభాకాంక్షలు చెబుతూ లేఖ రాశారు ప్రధాని నరేంద్ర మోదీ. అదే సమయంలో ఓ పొరుగు దేశంగా పాక్తో మంచి సంబంధాలను తాము కోరుకుంటున్నామని, అయితే దీనికోసం ఓ నమ్మకమైన, ఉగ్రవాదానికి తావు లేని వాతావరణం కల్పించడం తప్పనిసరి అని మోదీ స్పష్టం చేశారు. ఇక కొవిడ్-19పై పాక్ చేసిన పోరాటాన్ని కూడా ఈ సందర్భంగా మోదీ అభినందించారు. కొవిడ్ మహమ్మారి సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నందుకు పాకిస్థాన్ ప్రజలకు శుభాకాంక్షలు అని లేఖలో మోదీ అన్నారు.
మంగళవారం పాకిస్థాన్ తన 70 జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంది. ప్రపంచంలోనే తొలి ఇస్లామిక్ దేశంగా పాకిస్థాన్ మారిన మార్చి 23ను ప్రతి ఏటా నేషనల్ డేగా జరుపుకుంటారు. ప్రతి ఏటా ఈ రోజున పాక్ ప్రధానికి లేఖ పంపించడం సాధారణ ప్రక్రియనే అని అధికారులు వెల్లడించారు. సోమవారమే సింధూ నదీ జలాలపై చర్చించడానికి పాకిస్థాన్ అధికారులు ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందే. రెండేళ్ల తర్వాత రెండు దేశాల మధ్య ఈ చర్చలు జరిగాయి.