న్యూఢిల్లీ: సుందర్ పిచ్చాయ్.. గ్లోబల్ టెక్నాలజీ చిత్రంపై తళుక్కున మెరిశారు.. అది ఎప్పుడంటే.. 2019లో ఆల్ఫాబెట్, గూగుల్ సంస్థలకు ఇద్దరు సీఈవోలు, ఒక ప్రెసిడెంట్ అవసరం లేదని ల్యారీ పేజ్, సెర్జెయ్ బ్రిన్ నిర్ణయించుకున్నారు. ఆ దిశగా ల్యారీ పేజ్, సెర్జెయ్ ఒక అడుగు ముందుకేశారు.. అంతే.. గూగుల్ అండ్ అల్ఫాబెట్ సంస్థలకు సీఈవోగా నియమితులయ్యారు..
పిచ్చాయ్ తర్వాత 2 ఏండ్లకు మైక్రోసాఫ్ట్ అధినేతగా నాదెళ్ల
సరిగ్గా రెండేండ్ల తర్వాత మరో గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ సీఈవోగా ఉన్న సత్య నాదెళ్ల.. గురువారం సంస్థ చైర్మన్గానూ ఎన్నికయ్యారు.
మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్.. సీఈవోగా, చైర్మన్గా వైదొలిగాక 20 ఏండ్లకు సత్య నాదెళ్ల సీఈవో కం చైర్మన్గా నియమితులయ్యారు.
నాదెళ్ల.. పిచ్చాయ్ ఇద్దరూ ఇండియన్లే..
ఇటు సత్య నాదెళ్ల.. హైదరాబాదీ అయితే.. సుందర్ పిచ్చాయ్ తమిళ టెక్కీ.. ఇద్దరు ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్సే.. సత్య నాదెళ్ల-సుందర్ పిచ్చాయ్ ద్వయం.. ప్రతిభావంతులైన ఐటీ నిపుణులకు నిలయమైన గ్లోబల్ టెక్ దిగ్గజ సంస్థలకు సారధ్యం వహించనున్నారు.
ల్యారీ.. సెర్జెయ్లతో సుందర్ అనుభవం ఇలా..
‘నేను తొలిసారి ల్యారీ, సెర్జెయ్లను 2004లో కలిశాను. వారి గైడెన్స్తో నేను చాలా బెనిఫిట్ పొందాను. వారికి, నాకు భిన్నమైన విధులు ఉన్నా, వారితో కలిసి పని చేస్తూ ఉండటం నాకు గుడ్ న్యూస్’ అని సుందర్ పిచ్చాయ్ 2019లో తన బ్లాగ్ పోస్టులో రాసుకున్నారు.
2015లో గూగుల్ సీఈవోగా పిచ్చాయ్
‘వారు ఇప్పటికీ బోర్డు సభ్యులకు, సహ వ్యవస్థాపకులకు సలహాలిస్తూనే ఉన్నారు’ అని పేర్కొన్నారు. 2015 ఆగస్టు 10న సుందర్ పిచ్చాయ్.. గూగుల్ సీఈవోగా నియమితులయ్యారు.
మద్రాస్ (చెన్నై)లో జన్మించిన పిచ్చాయ్.. ఐఐటీ ఖరగ్పూర్లో మెటలర్జికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
గూగుల్.. ఆల్ఫాబెట్ గ్రోత్పై పిచ్చాయ్ ఇలా
‘నేను గూగుల్ గ్రోత్పై చాలా ఫోకస్ పెట్టాను. ప్రతి ఒక్కరికీ గూగుల్ మరింత సహాయకారిగా తీర్చిదిద్దడానికి క్రుషి చేస్తాను. టెక్నాలజీ ద్వారా పెద్ద పెద్ద సవాళ్లను అధిగమిస్తూ.. ఆల్ఫాబెట్ దీర్ఘకాలిక వ్యూహంపై ముందుకు వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నాను’ అని సుందర్ పిచ్చాయ్ చెప్పారు.
ఇలా నాదెళ్ల విద్యాభ్యాసం..
హైదరాబాదీ సత్య నాదెళ్ల.. కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో డిగ్రీ పట్టా అందుకున్నారు.
1975లో ఏర్పాటైన మైక్రోసాఫ్ట్ సంస్థ ఫౌండర్ బిల్ గేట్స్, సీఈవో స్టీవ్ బాల్మర్ తర్వాత 2014 ఫిబ్రవరి నాలుగో తేదీన సీఈవోగా నియమితులయ్యారు.
మైక్రోసాఫ్ట్ చైర్మన్గా నాదెళ్ల ఏకగ్రీవం
గురువారం మైక్రోసాఫ్ట్ సీఈవో కం చైర్మన్గా సత్య నాదెళ్లను సంస్థ బోర్డు ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. మైక్రోసాఫ్ట్ చైర్మన్గా సత్య నాదెళ్ల కలక సవాళ్లను గుర్తిస్తూ, సరైన వ్యూహాత్మక అవకాశాలను ఎలివేట్ చేస్తూ ముందుకు సాగాల్సి ఉంది.
అత్యంత విలువైన సంస్థగా మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా అవతరించింది.
అజూర్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ 365, ఎంటర్ ప్రైజెస్ కమ్యూనికేషన్ బిజినెస్ తదితర అంశాల్లో పురోగతి సాధించింది.
మైక్రోసాఫ్ట్లో అజూర్ క్లౌడ్ ఇలా పురోగతి
సేల్స్లో మైక్రోసాఫ్ట్ ప్రతిఏటా 19 శాతం గ్రోత్తో 41.7 బిలియన్ల డాలర్లకు చేరుకున్నది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో సంస్థ నికర ఆదాయం 15.5 బిలియన్ల డాలర్లుగా నిలిచింది.
మైక్రోసాఫ్ట్లో అజూర్ క్లౌడ్ డివిజన్ రెవెన్యూ 15.1 బిలియన్ల డాలర్లుగా నిలిచింది. ప్రతి ఏడాది గ్రోత్ 23 శాతం అభివ్రుద్ధి సాధిస్తున్నది.