చెన్నై: ముంబై ఇండియన్స్తో మ్యాచ్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్కు శుభవార్త. ఢిల్లీ పేసర్ ఇషాంత్ శర్మ సీజన్లోని మిగతా మ్యాచ్లు ఆడేందుకు సిద్ధమయ్యాడు. మడమ గాయం నుంచి కోలుకున్న ఇషాంత్, ఇప్పుడు ఫిట్నెస్ సాధించాడని, మ్యాచ్లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని డీసీ క్యాంప్ వర్గాలు తెలిపాయి.
సీజన్లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడిన ఢిల్లీ రెండింటిలో విజయం సాధించింది.
ఫామ్లో లేమితో సతమతమవుతున్న ఆ జట్టు ఫాస్ట్బౌలర్లు రబాడ, లుక్మాన్ మెరివాలా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఢిల్లీ పేస్ బౌలింగ్ ఎటాక్లో కీలకమైన ఇషాంత్ పూర్తి ఫిట్నెస్ సాధించడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఆవేశ్ ఖాన్ ఒక్కడే వైవిధ్యంగా బంతులేస్తూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేస్తున్నాడు.
డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైతో తలపడనున్న ఢిల్లీకి ఇషాంత్ మ్యాచ్ ఆడేందుకు అందుబాటులోకి రావడంతో సంతోషం వ్యక్తం చేస్తోంది. వాంఖడేలో మూడు మ్యాచ్ల్లో పాల్గొన్న ఢిల్లీ..తన తర్వాతి రెండు మ్యాచ్లను చెన్నై వేదికగా ఆడనుంది. ఇరుజట్ల బలాబలాలు సమానంగా ఉండడంతో పోరు రసవత్తరంగా మారనుంది.