వనపర్తి : కొవిడ్ వార్డులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, రోగులకు అవసరమైన మంచి నీటి సదుపాయం కల్పించాలని జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ ను కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా ఆదేశించారు. సీఎం కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆక్సిజన్, మందుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. కొవిడ్ పడకల ఖాళీల వివరాలు ప్రజలకు తెలుపాలన్నారు.
రెండో విడత జ్వర సర్వే త్వరితగతిన పూర్తి చేసి కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ఇసోలేషన్లో ఉంచి, రోజు వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు.
అదేవిధంగా జిల్లాలో లాక్ డౌన్ కఠినంగా అమలయ్యేలా చూడాలన్నారు. ఉద్యం 10 దాటినా తరువాత అనవసరంగా రోడ్ పైకి వచ్చిన వారిపై ఫైన్ వేయడంతో పాటు అవసరమైతే వాహనాన్ని స్వాధీం చేసుకోవాలని ఎస్పీకి సూచించారు.
లాక్ డౌన్ పెట్టిన తరువాత జిల్లాలో కరోనా వ్యాప్తి తగ్గిందన్నారు. ఇదే స్ఫూర్తితో అధికారులు పనిచేయాలని కలెక్టర్ కోరారు. రోహిణి కార్తె వస్తున్నందున ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలన్నారు.
ఇప్ప్పటి వరకు 1.7 మెట్రిక్ టన్నులు వరి ధాన్యం కొనుగోలు చేశామని, ఇంకా వచ్చే అవకాశమున్నందున, వచ్చే 10 రోజులలోగా మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారిని ఆదేశించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జిల్లా ఎస్పీ అపూర్వ రావు, డీహెంఎచ్వో, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ హరీష్, ఆర్ఎం ఓ డాక్టర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
షాపు తెరిచినందుకు రూ.3 వేల జరిమానా
అనంతగిరిలో కొవిడ్ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తాం
రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన మంత్రి అల్లోల
బావిలోంచి బాలుడి మృతదేహం వెలికితీత
సుందర్ లాల్ బహుగుణ మృతి పట్ల మంత్రి ఐకే రెడ్డి సంతాపం