షాబాద్ : పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం బాలికల పాఠశాలను సందర్శించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని, భౌతికదూరం పాటిస్తూ భోజనం చేయాలని సూచించారు. భోజనం చేస్తూ విద్యార్థినులతో ముచ్చటించిన మంత్రి పాఠశాలకు రావడం తమకు సంతోషంగా ఉందని తెలిపారు. ఉపాధ్యాయులు పాఠశాలల్లో నిబంధనలు పాటించాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంద్రరావు, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీత, అంధ్యనాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.