జనగామ : కొవిడ్ బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ చికిత్స కోసం కొవిడ్ కేర్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ విపరీతంగా పెరిగిపోతుందన్నారు. అందుకు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించి, కరోనా వ్యాప్తి నివారణకు సహకరించాలని పిలుపునిచ్చారు. కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించడానికి అవసరమైన రెమిడెసివీర్ ఇంజక్షన్లు, మందుల సరఫరాతో పాటు ఆక్సిజన్ను అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
కొవిడ్ బారినపడ్డ బాధితుల కోసం పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ స్కూళ్లో ప్రత్యేకంగా 100 బెడ్స్తో ఐసోలేషన్ సెంటర్ను ప్రారంభించామని తెలిపారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అమీజ్ అహ్మద్, జిల్లా వైద్యాధికారి మహేందర్, జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి తదితరలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మైనర్ వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
అంబులెన్స్లోనే కరోనా గర్భిణి ప్రసవం
సీఎం కేసీఆర్ వెంటే మంథని ప్రజలు
అజిత్ సింగ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం