హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, కౌంటింగ్కు సంబంధించి పాటించాల్సిన కొవిడ్-19 నిబంధనలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి పలు సూచనలు చేశారు. గురువారం రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుండి ఎన్నికలు జరగనున్న జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈసీ పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ సంయుక్త సంచాలకులు శివ బాలాజీ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, ఓఎస్డీ జయసింహ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.