హైదరాబాద్, ఆగస్ట్ 23(నమస్తే తెలంగాణ): మానవ సమాజం ప్రశాంత జీవనం కొనసాగించాలనే లక్ష్యంతో ‘గడప గడపకూ భగవద్గీత’ కార్యక్రమానికి కృష్ణం వందే జగద్గురుమ్ ఫౌండేషన్ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రూపొందించిన కోటి భగవద్గీత ఉత్సవం వెబ్సైట్ను త్రిదండి చినజీయర్స్వామి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ భగవద్గీత జయంతిని పురస్కరించుకుని డిసెంబర్ 14న హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్లో కోటి భగవద్గీతోత్సవాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రంగనాథ్ వేదాల, డాక్టర్ కృష్ణ వేదాల, రాజన్న యాదవ్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.