హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మెగా టూరిజం ప్రాజెక్ట్గా తీర్చిదిద్దాలని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కేంద్రా న్ని కోరారు. సోమవారం లోక్సభలో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ఆలయం నుంచి లక్ష్మీ బరాజ్ వరకు 22 కిలోమీటర్ల మేర ఉన్న గోదావరి బ్యాక్వాటర్ (కాళేశ్వరం) అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా ఉంటుందని, ఈ నేథ్యంలో వాటర్ ఫ్రంట్నైట్లైఫ్, క్రూజ్బోట్స్, వాటర్ స్పోర్ట్స్, ైగ్లెడింగ్ తదితర సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. మిడ్మానేర్, అన్నపూర్ణ, రంగనాయక్సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ తదితర రిజర్వాయర్లను సైతం పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలన్నారు.