నిడమనూరు: నల్లగొండ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన మండలంలోని కోటమైసమ్మ అమ్మ వారి ఆలయానికి భక్తులు పోటెత్తా రు. శ్రావణ మాసం చివరి రోజైన ఆదివారం నాడు జిల్లా నలు మూలల నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆలయ ఆవరణ భక్తుల రద్దీతో కిట కిటలాడింది.
ఆలయ ఆవరణలో అమ్మ వారికి మహిళా భక్తులు మేళ తాళాల నడుమ బోనాలు సమర్పించడంతో ఆలయ ఆవరణ సందడిగా మారింది. ఆలయ పూజారి చౌటి పద్మ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఆశీర్వచనం చేశారు. ప్రత్యేక పూజల్లో ఆలయ ఈవో సిరికొండ నవీన్ కుమార్, ఫౌండర్ ట్రస్టీ చౌటి ఆంజనేయులు, సిబ్బంది విఠలేశ్వర్, శ్రీనివాస్, రమణ, యాదయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.