మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు
జమ్మికుంట, సెప్టెంబర్ 22: పనిచేసే ప్రభుత్వానికే పట్టంగట్టాలని, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. పార్టీలో నుంచి ఓ వ్యక్తి పోయినంత మాత్రాన వ్యవస్థ ఆగిపోదని, వ్యక్తి కోసం కాకుండా, వ్యవస్థ కోసం కలిసి పనిచేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం జమ్మికుంటలోని ము న్సిపల్ చైర్మన్ నివాసంలో ఎరుకల, కుమ్మరి, టైలర్స్ సంఘాలకు కమ్యూనిటీ హాళ్లతోపాటు వాకర్స్ కోసం వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి మంజూరైన నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్ ప్రతులను ఆయా సంఘాల నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. హుజూరాబాద్ నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈటల రాజేందర్ మంత్రిగా పనిచేసినా ఇక్కడి అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలని కోరారు.
బాప్టిస్ట్ చర్చి ప్రారంభం..
దళిత క్రిస్టియన్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి కొప్పుల హామీ ఇచ్చారు. జమ్మికుంటలోని హన్మండ్లపల్లిలో నిర్మించిన బాప్టిస్ట్ చర్చిని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాడుతూ.. దళిత క్రిస్టియన్లకూ దళితబంధు వర్తింప జేయాలనే విజ్ఞప్తిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసు కెళ్తానని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలకు సమన్యాయం జరుగుతుందన్నారు.