నల్లగొండ రూరల్, జూన్ 9 : రజకుల ఆర్థిక బలోపేతానికి నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం చరిత్రాత్మకమని రజక సంఘాల సమితి రాష్ట్ర చీఫ్ అడ్వయిజర్ కొండూ రు సత్యనారాయణ పేర్కొన్నారు. ఉచిత విద్యుత్తు అమలు విధివిధానాల్లో మార్పులు చేయాలని రజక సంఘాల విజ్ఞప్తి మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, రజక ఫెడరేషన్ ఎండీ చంద్రశేఖర్ బుధవారం రాష్ట్ర స్థాయి రజక సంఘ ప్రతినిధులతో జూమ్లో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న కనెక్షన్తోనే అమలుచేయాలని, ట్రేడ్ లైసెన్స్, అద్దె అగ్రిమెంట్ తీసివేయాలని కోరారు. మూడు నెలల అడ్వాన్స్ బిల్లు చెల్లింపు ప్రభుత్వమే చెల్లించాలని విజ్ఞప్తిచేశారు. యాంత్రిక దోభీ ఘాట్కు కేటగిరి 3 ఎల్టీ కనెక్షన్ ఇవ్వాలని కోరారు. రజక సంఘాల జిల్లా ప్రతినిధులు చిలకరాజు చెన్నయ్య, లకడపురం వెంకన్న, శ్రీను, వెంకన్న, శంకర్, తదిదతరులు పాల్గొన్నారు.