తిరువనంతపురం: కేరళలో బీజేపీకి దిమ్మదిరిగే షాక్ తగిలింది. ఎన్నికలకు ముందు కేరళలో 35 స్థానాలు గెలుస్తామని ప్రగల్బాలు పలికిన ఆ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఇంతకు ముందు ఉన్న ఒక్క స్థానం కూడా కోల్పోవడం గమనార్హం. బీజేపీ తన సిట్టింగ్ స్థానం నెమోమ్లో కూడా కోల్పోయింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ సహా నటుడు సురేశ్ గోపీ, మెట్రోమ్యాన్ శ్రీధరన్ కూడా ఓటమి పాలయ్యారు.
నెమోమ్ స్థానంలో మొదట బీజేపీ అభ్యర్థి రాజశేఖరన్ ఆధిక్యంలో నిలిచినా.. తర్వాత మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఈ స్థానం నుంచి ఎల్డీఎఫ్ అభ్యర్థి శివన్కుట్టీ 2025 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అటు మెట్రోమ్యాన్ శ్రీధరన్ను పాలక్కడ్ స్థానంలో ఎల్డీఎఫ్ అభ్యర్థి షఫీ పారంబిల్ 2657 ఓట్ల తేడాతో ఓడించారు. అటు త్రిస్సూర్లో మొదట్లో ఆధిక్యంలో ఉన్న సురేశ్ గోపీ చివరికి మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు. ఈ మూడు స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని భావించినా చివరి రౌండ్లలో ఆ పార్టీ అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారు.