భూదాన్పోచంపల్లి: ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతీ ఏటా రాష్ట్ర ప్రభుత్వ చేనేత కళాకారులకు అందించే కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రీయ పురస్కారానికి పోచంపల్లికి చెందిన భోగ బాలయ్య ఎంపికయ్యారు. ఆయన ఒకే చీరలో 121 రంగులతో 121 డిజైన్లను రూపొందించి ఆ చీరకు మరింత అందాన్ని అద్దాడు. సాంప్రదాయ చేనేత వస్ర్తాలలో ఎక్కువ సంఖ్యలో రంగులు వాడటంతో పాటు ఇంతవరకు ఎవరూ రూపొందించని విధంగా ఎక్కువ డిజైన్లను ఒకే చీరలో నేయాలని అనుకున్న భోగ బాలయ్య సుమారు రెండు సంవత్స రాలు శ్రమించి 121 రంగులతో సుమారు అన్నే డిజైన్లను గ్రాఫ్ పై వేసుకొని నిలువు పేకల మగ్గంపై 121రంగుల్లో 121 డిజైన్లలో చేనేత వస్ర్తాన్ని తయారు చేసి పలువురితో శభాష్ అనిపించుకుని ప్రభుత్వం అందించే కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారానికి ఎంపిక అయ్యాడు.
ఈ రంగుల చీర తయారీలో ప్రత్యేకత
ఈ చీర తయారీలో చేనేత కార్మికుడు బాలయ్య మొత్తం 22 చిటికీలను వాడాడు. ప్రతీ చిటికీకి 22 కొయ్యలు ఆరు కొలుకులతో ఈ చీరను తయారు చేశాడు. ఈ చీర తయారీలో కోయంబత్తూర్కు చెందిన 2/20 నబర్ గల మాస్టర్ నూలును వాడాడు. దీని కోసం ఆకుపచ్చ, పసు పు, నీలం, ఆరెంజ్, ఆనంద, చిలుకపచ్చ, బంగారు వర్ణం, గోదుమ, గ్రే, లెమన్ ఎల్లో, వాయిలేట్, గులాబీ లాంటి మొత్తం 12 రకాల రంగులతో సుమారు 121 రంగులను తయారు చేశాడు. గ్రాఫ్ పై శ్రమించి సుమారు 121 డిజైన్లను రూపొందించి వాటిని పేకపై చిటికీ కట్టి డిజైన్లను రూపొందించడంతో పాటు ఎంతో శ్రమించి రంగులను అద్దాడు. దీని కోసం మొత్తం ఎకో ఫెండ్లీ రంగులను మాత్రమే వాడినట్లు బాలయ్య తెలిపాడు. ఈ చీరలకు 22 చిటికీలు వాడగా 11 నిలువు రంగులు, 11 పేక రంగులు వాడారు. కనీసం 1.5 ఈచిల అంచులో 121 రంగులు కనిపించేలా ఎంతో కష్ట పడి ఈ డిజైన్ను రూపొందించారు. ఈ చీర మ్తొతం సప్తవర్ణ శోభితమే కాదు కనులకు కనువిందు చేసేలా కని పిస్తుంది.