చేర్యాల, ఏప్రిల్ 12: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల ముగిం పు సందర్భంగా అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువజాము వరకు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి భక్తులను అనుమతించలేదు. గత డిసెంబర్లో స్వామి వారి కల్యాణోత్సవంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఆదివారం అర్ధరాత్రి అగ్నిగుండాల కార్యక్రమంతో ముగిశాయి.