హైదరాబాద్ : నిజామాబాద్లోని తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా నియమితులైన ప్రొఫెసర్ డి.రవీందర్ గుప్త కు తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ అభినందనలు తెలిపారు. శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దామోదర్ మాట్లాడుతూ.. ఒక విశ్వవిద్యాలయానికి వీసీగా వైశ్య వర్గానికి చెందిన వ్యక్తిని నియమించడం అరుదైన సంఘటన అన్నారు.
తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ వైశ్య వర్గానికి సముచిత స్థానం కల్పించారన్నారు. సీఎం కేసీఆర్ ఆదర్శాలకు అనుగుణంగా తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్ది తెలంగాణ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దాల్సిందిగా వీసీ రవీందర్గుప్తాను ఆయన ఈ సందర్భంగా కోరారు.