చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో దారుణం జరిగింది. చౌటుప్పల్లోని రాంనగర్లో ముగ్గురు పిల్లలకు ఉరివేసి ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రామ్నగర్లో ఉంటున్న రాణి అనే మహిళ తన ముగ్గురు కూతుళ్లకు నిన్న రాత్రి ఉరివేసింది. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. అయితే వారిలో ఇద్దరు చిన్నారులు మరణించగా, ఉరి జారడంతో మరో అమ్మాయి మృత్యువు నుంచి బయటపడింది. ఇవాళ ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులను తల్లి తొర్పునూరి ఉమారాణి (32), పిల్లలు హర్షిణి (14), లక్కీ (10)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.