హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు నియమితులయ్యారు. రాజ్యసభలో పలు కమిటీలను గురువారం రాజ్యసభ సెక్రటేరియట్ ప్రకటించింది. రూల్స్ కమిటీలో టీఆర్ఎస్ పార్టీ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డికి స్థానం కల్పించారు. సబార్డినేట్ లేజిస్లేషన్ కమిటీలో బండ ప్రకాశ్, హౌస్ కమిటీ సభ్యుడిగా బడుగుల లింగయ్యయాదవ్ను నియమించారు.