హైదరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గ నేత పాడి కౌశిక్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కౌశిక్రెడ్డికి పీసీసీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నోటీసుల్లో పేర్కొంది. గతంలో కౌశిక్రెడ్డిని పీసీసీ క్రమశిక్షణా సంఘం హెచ్చరించిన విషయం తెలిసిందే.