హైదరాబాద్ : కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్) నిధుల సమీకరణ నిమిత్తం ప్రజల ముందుకి రానుంది. రూ.2,144 కోట్ల పెట్టుబడి లక్ష్యంగా ఐపీవోకు రానుంది. షేర్ ప్రారంభ ధర రూ.815 నుండి 825గా నిర్ణయించింది. ఈ ఐపీవో జూన్ 16న ప్రారంభమై జూన్ 18న అంటే మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఈక్వీటీ షేర్లను బీఎస్సీ అదేవిధంగా ఎన్ఎస్ఈలో లిస్ట్ చేయాలని ప్రతిపాదన. తాజా ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయం సంస్థ దాని అనుబంధ సంస్థల రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఉపయోగించబడుతుందంది.
పబ్లిక్ ఇష్యూలో 75 శాతం అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు, 15 శాతం సంస్థేతర బిడ్డర్లకు, 10 శాతం రిటైల్ పెట్టుబడిదారులకు కేటాయించబడింది. కిమ్స్ హాస్పిటల్స్ బ్రాండ్ కింద కిమ్స్ మొత్తం 9 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను రన్ చేస్తుంది. 31 డిసెంబర్,2020 నాటికి 2,500 ఆపరేషనల్ బెడ్స్తో కలుపుకుని మొత్తం 3,064 పడకల సామర్థ్యం కలిగి ఉంది. ఈ సంస్థ ఆరోగ్యరంగలో 25 కి పైగా స్పెషాలిటీస్ అండ్ సూపర్ స్పెషాలిటీలస్ను కలిగి ఉంది. పబ్లిక్ ఇష్యూ నిమిత్తం కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, యాక్సిస్ క్యాపిటల్, క్రెడిట్ సూయిస్ సెక్యూరిటీస్ (ఇండియా), ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీలను బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా నియమించారు.