అహ్మదాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్ధశతకం సాధించాడు. ఈ సీజన్లో రాహుల్కిది నాలుగో హాఫ్సెంచరీ కావడం విశేషం. ఓవరాల్గా ఐపీఎల్లో 25వ అర్ధశతకం. ఓవైపు రాహుల్ నిలకడగా రాణిస్తుండగా మరో ఎండ్లో బ్యాట్స్మెన్ అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. బెంగళూరు బౌలర్ల ధాటికి పంజాబ్ 4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయింది. నికోలస్ పూరన్(0), దీపక్ హుడా(5), శారుక్ ఖాన్(0) దారుణంగా విఫలమయ్యారు. 15 ఓవర్లకు పంజాబ్ 5 వికెట్లకు 119 పరుగులు చేసింది. హర్ప్రీత్ బ్రార్(1), కేఎల్ రాహుల్(56) క్రీజులో ఉన్నారు.