ఖమ్మం : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్కు మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లను టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. మేయర్గా పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్గా ఫాతిమా జోహ్రో పేర్లను ఖరారు చేశారు. ఈ మేరకు వీరిద్దరి పేర్లను ఎన్నికల పరిశీలకులు మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. పునుకొల్లు నీరజ 26వ డివిజన్ నుంచి గెలుపొందగా, ఫాతిమా జోహ్రా 37వ డివిజన్ నుంచి గెలుపొందారు.
ఖమ్మం మున్పిపల్ కార్పొరేషన్లో మొత్తం 60 స్థానాలకు టీఆర్ఎస్ 45 డివిజన్లలో, కాంగ్రెస్ 10, ఇతరులు 5 డివిజన్లలో గెలుపొందగా, బీజేపీ ఒక డివిజన్లో మాత్రమే గెలిచింది.