హైదరాబాద్: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కరోనా కారణంగా కొంతకాలం ప్రత్యక్ష తరగతులకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ విద్యార్థులకు 70 శాతం, 50 శాతం సిలబస్ ఛాయిస్తో కూడిన అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
అలాగే మరిన్ని ఛాయిస్లు ఉండేలా ప్రశ్నాపత్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ చెప్పారు. అలాగే విద్యార్థుల కోసం ఉచితంగా స్టడీ మెటీరియల్ను అందుబాటులో ఉంచుతున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వివిధ సబ్జెక్టుల్లో నిష్ణాతులైన వారితో ఈ స్టడీ మెటీరియల్ను రూపొందించినట్లు ఆమె చెప్పారు.
జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, గణితం, భౌతికశాస్త్రం, చరిత్రకు సంబంధించిన స్టడీ మెటీరియల్స్ను మంగళవారం నుంచే అందుబాటులో ఉంచుతున్నామని, మిగతా సబ్జెక్టుల స్టడీ మెటీరియల్ను కూడా త్వరలోనే అందిస్తామని విద్యాశాఖ మంత్రి తెలియజేశారు.
ఈ స్టడీ మెటీరియల్స్ను www.tsbie.cgg.gov.in వెబ్సైటు నుంచి పొందవచ్చని తెలిపారు. మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో విద్యాశాఖ కమిషనర్ ఉమర్ జలీల్, ఉడిత్యాల రమణ, మహేందర్ కుమార్, వసుంధరా దేవి తదితరులు పాల్గొన్నారు.