రామగిరి, ఏప్రిల్8: సెంటినరీ కాలనీలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ (ఏఎల్పీ)ను గురువారం ట్రైనీ ఐఏఎస్ల బృందం సందర్శించింది. తెలంగాణ దర్శన్లో భాగంగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి చెందిన సీ రాంబాబు ఆధ్వర్యంలో గనిలోని యంత్రాలు, బొగ్గు ఉత్పత్తి తీరును పరిశీలించారు. అనంతరం జీఎం చాంబర్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్ట్కు సంబంధించిన అంశాలను ఏపీఏ జీఎం ఎన్వీకే శ్రీనివాస్ వివరించారు. బొ గ్గు ఉత్పత్తికి దేశంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకున్నదని చెప్పారు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో త యారైన యంత్రాలను వినియోగించి బొగ్గు ఉత్ప త్తి చేస్తున్నామని, ఏడాదికి 2 మిలియన్ టన్నులు వెలికి తీస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఎల్పీ ప్రాజెక్ట్ ఆఫీసర్ నాగేశ్వర్రావు, ఏఎస్వో జయరాజు, ఐఏఎస్ ట్రెనీ బృం దం సభ్యులు వరుణ్రెడ్డి, హేమంత్ కేశవ్, చిత్రమిశ్రా, ప్రతిమ సింగ్, అన్విత్, దీపక్ తివారి ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఫ్యూచర్-రిలయన్స్ డీల్పై సుప్రీంకు అమెజాన్
అండర్వాటర్ రిథమిక్ జిమ్నాస్టిక్స్తో ఆకట్టుకున్న మహిళ