హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నదని వ్యవసాయరంగ జాతీయ నిపుణులు కొనియాడారు. ఇది హర్షించదగిన పరిణామమని కితాబిచ్చారు. రైతుల కోసం పరితపిస్తున్న సీఎం కేసీఆర్ అభినందనీయులని మెచ్చుకున్నారు. శనివారం జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్హెచ్చార్డీలో ‘రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ ఫర్ పారాడిజం షిఫ్ట్ టువార్డ్స్ స్ట్రక్చరల్ చేంజెస్ ఫర్ సస్టేనబుల్ అగ్రికల్చరల్ వాల్యూ చైన్ – ఆపర్చునిటీస్ అహెడ్’ అనే అంశంపై జాతీయ సెమినార్ నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి సోంపాల్ శాస్త్రీ, వ్యవసాయరంగ నిపుణులు అమితాబ్ కుండు, రవీంద్ర ధారియా, రాజ్వీర్ శర్మ, కే కే త్రిపాఠి, జీ అగర్వాల్, వినీత హరిహరన్, ఖుషీ రాధ్య, మోహన్ కందా, వినోద్ ఆనంద్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, సీజీజీ డీజీ రాజేంద్ర నింజే, డైరెక్టర్ జువ్వాడి దేవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పండించిన పంటకే కాకుండా.. వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే వస్తువుల అమ్మకాల్లోనూ రైతులకు వాటా దక్కాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. అప్పుడే రైతుకు ఆర్థికంగా మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్టు చెప్పారు. రైతులను సంఘటితం చేసేందుకు రైతు ఉత్పాదక సంస్థలను (ఎఫ్పీవో) ఎకడికకడ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల, వ్యవసాయ, విద్యుత్తురంగాల్లో చేపట్టిన విప్లవాత్మక చర్యల వల్ల ఆయా రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిందని బోయినపల్లి వినోద్కుమార్ పేరొన్నారు. ఇదే విషయాన్ని నీతి ఆయోగ్ అర్థ్ నీతి నివేదికలో స్పష్టంగా పేరొన్నదని గుర్తుచేశారు. వ్యవసాయం, దాని అనుబంధరంగాల్లో తెలంగాణ ఆవిర్భావం ముందు రెండుశాతం ఉన్న వృద్ధి.. ప్రస్తు తం 16.5% శాతానికి చేరుకున్నదని చెప్పారు.