వికారాబాద్, ఏప్రిల్ 5 : ప్రతిఒక్కరూ భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్రామ్ అడుగుజాడల్లో నడుచుకోవాలని కలెక్టర్ పౌసుమిబసు అన్నారు. సోమవారం వికారాబాద్లోని బీజేఆర్ చౌరస్తాలో ఆయన 114వ జయంతిని పురస్కరించుకుని వికారాబాద్, చేవెళ్ల ఎమ్మెల్యేలు అనంద్, యాదయ్యతో కలిసి ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జగ్జీవన్రామ్ కులరహిత సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్యతి కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. జగ్జీవన్రామ్ కుల అణచివేత, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా కుల రహిత సమాజం కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, అడిషనల్ ఎస్పీ రషీద్, ఆర్డీవో ఉపేందర్రెడ్డి, డీఎస్సీడీవో మల్లేశం, టీటీడీవో కోటాజీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, ఎంపీపీ చంద్రకళ, పుర ప్రముఖులు, సంఘం నాయకులు పాల్గొన్నారు.
కొడంగల్ మండలంలో..
కొడంగల్, ఏప్రిల్ 4 : సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నాగరాజరావు, అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాల నాయకులు జగ్జీవన్రామ్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది గోపాల్, రాములు, జగ్జీవన్రామ్ సంఘం అధ్యక్షుడు జూనియర్ కృష్ణంరాజు, సీఐటీయూ నాయకులు బుస్స చంద్రయ్య, సోమశేఖర్, దస్తప్ప పాల్గొన్నారు.
మర్పల్లి మండలంలో..
మర్పల్లి, ఏప్రిల్ 5 : మండల పరిధిలోని పట్లూర్, కోట్మర్పల్లి తదితర గ్రామాల్లో బీజేఆర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జగ్జీవన్రామ్ జయంతిని జరుపుకున్నారు. పట్లూర్లో బీజేఆర్ యువజన సంఘం అధ్యక్షుడు సురేశ్, ప్రధానకార్యదర్శి వికాస్, కోట్మర్పల్లిలో రైతు బంధు గ్రామాధ్యక్షుడు రాచయ్య ఆధ్వర్యంలో నివాళులర్పించారు.
కోట్పల్లి మండలంలో..
కోట్పల్లి, ఏప్రిల్ 5 : మండల కేంద్రంలో జగ్జీవన్రామ్ చిత్రపటానికి మత్స్య శాఖ మండల అధ్యక్షుడు రావిరాల ఆనంద్, నాయకులు సిద్ది వీరన్న, ఉప్పరి మహేందర్, అహ్మద్ పాషా, నగేశ్, నర్సింహులు, రహీం పాల్గొన్నారు.
దౌల్తాబాద్ మండలంలో..
దౌల్తాబాద్, ఏప్రిల్ 5 : మండల కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జగ్జీవన్రామ్ జయంతిని ఏఐవైఎఫ్ యువజన సంఘం నాయకుల ఆధ్వర్యంలో జరుపుకున్నారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాజు జగ్జీవన్రామ్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకుడు భీములు, డీహెచ్పీఎస్ నాయకుడు సాయిలు, ఏఐవైఎఫ్ నాయకులు ముస్తా, బుగ్గప్ప, అంబయ్య, అంజిలప్ప, మల్కప్ప, దళిత సంఘం నాయకులున్నారు.
ఇవీ కూడా చదవండి…
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
నాయీ బ్రాహ్మణులకు అండగా ప్రభుత్వం