చిలుపూరులో సీఎం కేసీఆర్ విగ్రహావిష్కరణ
చిలుపూరు, జూన్ 2: ముఖ్యమంత్రి కేసీఆర్పై అభిమానంతో జనగామ జిల్లా చిలుపూరు మండలకేంద్రంలో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని తయారుచేయించారు సర్పంచ్ ఉద్దెమారి రాజ్కుమార్. గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో సొంతంగా రూ.5 లక్షలు వెచ్చించి తొమ్మిది అడుగుల విగ్రహాన్ని తయారుచేయించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిన నాయకుడు ‘నా దేవుడు సీఎం కేసీఆర్’ అని రాజ్కుమార్ తెలిపారు.