కొండపోచమ్మసాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలా లు తొమ్మిదో రోజూ పరుగులు తీశాయి. తొమ్మిది రోజుల్లో సిద్దిపేట జిల్లాలోని 9 చెక్డ్యామ్లు, 4 చెరువులను, మెదక్ జిల్లాలో 12 చెక్డ్యామ్లను గంగమ్మ నింపింది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట శివారులోని హల్దీ ప్రాజెక్టులోకి 2 రోజుల్లో రెండుమీటర్ల వరకు నీరు చేరింది. మరో మీటరున్నర మేర నీరు చేరితే ప్రాజెక్టు అలుగుపారనున్నది. గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయానికి మత్తడి దుంకే అవకాశం ఉన్నది.