హైదరాబాద్: అమరవీరులను, కాలధర్మం చెందిన వారిని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. హైదరాబాద్లోని హైటెక్స్లో టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అమరవీరులను స్మరించుకున్నారు. 20 ఏండ్ల పార్టీ ప్రస్థానంలో తమతో అనేక మంది కలిసి పనిచేశారని అన్నారు. పార్టీకి నిబద్ధులైన నాయకులు కీర్తిశేషులయ్యారని, చరిత్రలో వారిపేర్లు చిరస్థాయిగా నిలవాలని చెప్పారు. కీర్తి శేషులైన పార్టీ నాయకులకు ప్లీనరీ సంతాపం తెలిపింది. అమరులకు ప్రతినిధుల సభ రెండు నిమిషాలపాటు మౌనం పాటించింది.
పార్టీ అధినేతగా సీఎం కేసీఆర్ తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్లీనరీ వేదికగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి పార్టీ ప్రతినిధుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.