ఇబ్రహీంపట్నం రూరల్, ఆగస్టు 7 : దళితబంధు పథకంపై ప్రముఖ కళాకారుడు బోడ చంద్రప్రకాశ్ రాసి, పాడిన పాటకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిదా అయ్యారు. దళితుల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్కు చెందిన కళాకారుడు చంద్రప్రకాశ్ దళితబంధు పథకం ఆవశ్యకతపై పాట రాసి పాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకంపై పాడిన పాటల్లో చంద్రప్రకాశ్ పాటను సీఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యత కింద ఎంపికచేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ మాట్లాడుతూ.. తన పాటను సీఎం కేసీఆర్ తొలి ప్రాధాన్యతనిచ్చి ఎంపిక చేయడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు.