హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): దళితుల అభ్యున్నతే ధ్యే యంగా, చిత్తశుద్ధితో కృషిచేస్తున్న ము ఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు నిజమైన వారసుడు, అభినవ అంబేద్కర్ అని మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు కొనియాడారు. దళితులు సమున్నతంగా ఎదిగేందుకు దళితబంధు పథకాన్ని తెచ్చిన మొనగాడు, నిజమైన మానవతావాది సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు. రాజకీయాలకు అతీతంగా అ న్ని పార్టీల్లోని దళిత నేతలు సీఎంకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. దళిత, బడుగు, బలహీనవర్గాలకు బీజేపీ న్యాయం చేయడంలేదని, అ క్కడ ఇమడలేక ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. శుక్రవారం మోత్కుపల్లి హైదరాబాద్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడు తూ.. తాను బీజేపీకి రాజీనామాచేయడానికి దారితీసిన కారణాలను వివరించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ప్రశంసించారు. ఈ పథకంపై ఊరూరా దండోరా వేసి కృతజ్ఞత చాటాలని దళితులకు పిలుపునిచ్చారు. దళితవర్గాలు ఆర్థిక పరిపుష్టిని సాధించటం ద్వారానే వారికి సామాజిక గుర్తింపు వస్తుందన్న సత్యాన్ని, అంబేద్కర్ ఆశయాన్ని అమలుచేస్తున్న నిజమైన పాలకుడు సీఎం కేసీఆర్ అని కీర్తించారు.
ఈటలను బహిష్కరించండి
దళితుల భూములను ఆక్రమించి, వం దల ఎకరాలు, రూ.వేల కోట్లు అప్పనంగా సంపాదించిన ఈటల రాజేందర్ను హుజూరాబాద్ ప్రజలు బహిష్కరించాలని మోత్కుపల్లి పిలుపునిచ్చా రు. ఈటల ఎవరిని ఉద్ధరించటానికి పోటీచేస్తున్నారని నిలదీశారు. ఆయన కు పోటీ చేసే నైతిక హక్కులేదన్నారు. దళితుల, బడుగు, బలహీనవర్గాల భూములు, ఆస్తులు కొల్లగొట్టే తిమింగలం ఈటల అని, ఆయన వ్యవహా రం బయటపడ్డరోజే ఆ భూములను వాపస్ చేయాలని తాను డిమాండ్ చే సినట్టు చెప్పారు. దళితుల, దేవాలయ భూములను ఆక్రమించిన వ్యక్తిని బీజేపీలో ఎలా చేర్చుకొంటారని ప్రశ్నించారు. ఈటలను పార్టీలో చేర్చుకొంటున్న విషయం బీజేపీ నేతలు తనకు మాటమాత్రమైనా చెప్పలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
అవమానాల వల్లనే బీజేపీకి రాజీనామా
బీజేపీలో తనకు అవమానం జరిగిందని, ఆత్మగౌరవాన్ని చంపుకొని ఆ పా ర్టీలో ఇమడలేక రాజీనామా చేస్తున్న ట్టు మోత్కుపల్లి ప్రకటించారు. దళితవర్గాల శ్రేయస్సు కోసం అఖిలపక్ష సమావేశానికి రావాలని స్వయంగా సీఎం కేసీఆర్ ఆహ్వానిస్తే.. తనను వెళ్లొద్దంటూ బీజేపీ అధ్యక్షుడు బండి సం జయ్ అడ్డు చెప్పారని వెల్లడించారు. పార్టీకి దళితులు ఇప్పటికే దూరంగా ఉ న్నారని, సమావేశానికి వెళ్తేనే బాగుంటుందని ఎమ్మెల్యే రఘునందన్ సూచి స్తే, సంజయ్ మాత్రం తనను బంధిం చే ప్రయత్నం చేశాడని, తాను బందీగా ఉండదలచుకోలేదని పేర్కొన్నారు. దళిత బంధు పథకం ప్రవేశపెట్టినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చె బితే తట్టుకోలేని స్థితిలో బీజేపీ నాయకులున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
దళితులు బీజేపీలో ఇమడలేరు: పల్లా
ఖైరతాబాద్, జూలై 23: ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలను దూరం పెట్టిన బీజేపీలో దళితులు కూడా ఇమడలేరని ఎమ్మెల్సీ, తెలంగాణ రైతు బంధు స మితి చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.. దళితులు, దళిత నాయకులను బీజేపీ ఎదగనీయదని విమర్శించారు. పేదలు ఎప్పుడూ పేదలుగానే ఉండాలని, వారితోనే రాజకీయం చేయాలన్నది ఆ పార్టీ పోకడ అని దుయ్యబట్టారు. సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకి రాజీనామాచేయడం.. దళిత నేతలంతా సీఎం కేసీఆర్ వైపు, దళితబంధు పథకం వైపు చూస్తున్నారనడానికి ఉదాహరణ అని పేర్కొన్నారు.