కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు సాయాన్ని అందజేసిన సీఎం కేసీఆర్కు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రైతులతో కలిసి పుష్పాభిషేకం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తూరులోని రైతువేదిక వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం కేసీఆర్ యాసంగి దిగుబడులను మద్దతు ధరకు కొనుగోలు చేసి అన్నదాతలకు అండగా నిలిచారని సండ్ర కొనియాడారు.
– సత్తుపల్లి