హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): దళిత బంధుపై మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘20వ శతాబ్దంలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయం ద్వారా దళితుల అభివృద్ధి జరుగుతుందని విశ్వసిస్తే.. 21వ శతాబ్దంలో సీఎం కేసీఆర్ ఆర్థిక సాధికారత ద్వారా దళితుల అభ్యున్నతికి ప్రయత్నిస్తున్నారు. మరో మార్గదర్శక కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సీఎం కేసీఆర్కు వందనాలు’అని ట్విట్టర్లో పేర్కొన్నారు.