జడ్చర్ల టౌన్, జూలై 6: సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం దళిత సాధికారత పథకాన్ని తీసుకొచ్చారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. దళిత సాధికారత పథకాన్ని హర్షిస్తూ మంగళవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని చంద్రాగార్డెన్ ఫంక్షన్ హాలులో నియోజకవర్గ దళిత సామాజిక సంఘాల ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. అట్టడుగున ఉన్న దళితులను సమాజంలో తలెత్తుకొని బతికేలా సీఎం కేసీఆర్ దేశ చరిత్రలోనే ఒక గొప్ప ముందడుగు వేశారని కొనియాడారు. వచ్చే మూడేండ్లలో వారి అభివృద్ధి కోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేయటానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. దళిత విద్యావంతులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో విదేశాలకు వెళ్లి చదువుతున్న వారికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారని తెలిపారు. అంతకుముందు దళిత సామాజిక సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని గజమాలతో సత్కరించారు. సీఎం కేసీఆర్కు దళిత సామాజిక సంఘాల నాయకులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.