హైదరాబాద్, సెప్టెంబర్11 (నమస్తే తెలంగాణ): నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికల సీఎండీ దీవకొండ దామోదర్రావును పలువురు ప్రముఖులు శనివారం పరామర్శించారు. ఇటీవల ఆయన తండ్రి నారాయణరావు పరమపదించిన నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ కవిత బంజారాహిల్స్లోని దామోదర్రావు నివాసానికి వెళ్లి, వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. దివంగత నారాయణరావు ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. దామోదర్రావు తల్లి ఆండాలమ్మను కవిత ఓదార్చారు.