హుజూరాబాద్ నేత పాడి కౌశిక్రెడ్డి అనుచరులు, కార్యకర్తలు, నాయకులతో వేలాది మందిగా ర్యాలీగావచ్చి టీఆర్ఎస్లో చేరారు. గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి వందల కార్లతో ర్యాలీగా కొండాపూర్, హైటెక్సిటీ, రాయదుర్గం, జూబ్లీచెక్పోస్ట్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా తెలంగాణభవన్ చేరుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి వేలమంది యువత, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వర్షంపడుతున్నా లెక్కచేయక తరలివచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయతక్వంలోని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై టీఆర్ఎస్లో చేరామని కౌశిక్రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్లో చేరిన అనంతరం తెలంగాణభవన్ ఎదుట అనుచరులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. హుజూరాబాద్ నియోజకర్గ అభివృద్ధి ఏకైక లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రైతుబంధు పథకాన్ని హుజూరాబాద్లో ప్రారంభించిన సీఎం కేసీఆర్, దళితుల జీవితాలను మార్చాలనే లక్ష్యంతో చేపట్టిన దళితబంధు పథకాన్ని కూడా ప్రారంభించటం హర్షణీయమని తెలిపారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ఇల్లిల్లూ తిరుగుతూ ప్రచారం చేయాలని తన అనుచరులకు సూచించారు.
హుజూరాబాద్ నియోజకర్గంలోని అన్నిమండలాల నుంచి వేలాదిగా తరలివచ్చి టీఆర్ఎస్లో చేరారు. బుధవారం టీఆర్ఎస్లో చేరిన వారిలో వీణవంక మండలం నుంచి కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్రెడ్డి, మండల అధ్యక్షుడు కాసర్ల సుధాకర్, సర్పంచ్, జిల్లా ఉపాధ్యక్షుడు మేకల స్వామిరెడ్డి జమ్మికుంట నుంచి డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోలినేని సత్యనారాయణరావు, మాజీ మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రామస్వామి, టౌన్ ప్రెసిడెంట్ దిలీప్, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గాజుల భాస్కర్, ఇల్లందకుంట నుంచి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మర్రి శ్రీనివాస్రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ విక్రమ్గౌడ్, హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింత శ్రీనివాస్, టౌన్ ప్రెసిడెంట్లు సాయి, అమ్జద్, ఎంపీటీసీ, మండల అధ్యక్షుడు రావుల వెంకట్, జిల్లా ప్రధాన కార్యదర్శ బాలరాజు, కమలాపూర్ నుంచి కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, మండల అధ్యక్షుడు బొల్లం రాజిరెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కనపల్లి రమేశ్, టౌన్ ప్రెసిడెంట్ చంద్రారెడ్డి, సర్పంచ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సారయ్య, ఎంపీటీసీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాక రవీందర్ తదితరులు ఉన్నారు. వారంతా తమ అనుచరగణంతో సీఎం సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.