హైదరాబాద్ : టీపీసీసీ మాజీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కౌశిక్రెడ్డికి సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కౌశిక్రెడ్డి వెంట వచ్చిన అనుచరులను సీఎం టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.