వనపర్తి : జిల్లాకు నూతనంగా 5 వెంటిలేటర్లు మంజూరు అయినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిని త్వరితగతిన సిద్ధం చేసుకోవాలని జిల్లా దవాఖాన అధికారులను మంత్రి ఆదేశించారు. దీనికి అవసరమైన సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించికోవాలని, అదేవిధంగా జిల్లాలో అవసరానికి సరిపడా అందుబాటులో రెమిడెసివర్ ఇంజక్షన్లు ఉంచుకోవాలన్నారు.
ప్రైవేటు ల్యాబ్లు ప్రజల వద్ద పరీక్షలకు అధిక బిల్లులు వసూలు చేయకూడదన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో తప్పనిసరి పరిస్థితులలో అవసరమైతేనే సీటీ స్కాన్కు సిఫారసు చేయాలన్నారు.
కరోనా తగ్గుముఖం పట్టేవరకు ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించి, స్వీయ నియంత్రణ పాటించాలని మంత్రి తెలిపారు. లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలన్నారు.