Telangana
- Dec 02, 2020 , 17:15:22
VIDEOS
యాదాద్రిలో కార్తీక మాసం సందడి

యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ఉదయం ఆరాధన బాలబోగం, పంచామృత అభిషేకం గావించి పట్టు వస్ర్తాలు ధరింపజేశారు. వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకారం చేశారు. ఉదయం సుదర్శన నారసింహహోమం, గరుడ ఆంజనేయం, సుదర్శనం వంటి దేవతల మూలమత్రాలతో హవనం చేశారు. అలాగే సాయంకాలం వెండి జోడు సేవ, నిత్యకల్యాణంలో గరుడ సేవలు నిర్వహించారు.
దేవస్థానం ఏర్పాటు చేసిన 108 బంగారు పుష్పాలతో సువర్ణ పుష్పార్చన గావించారు. కార్తీకమాసం సందర్భంగా స్వామివారి కొండపై గల వ్రత మండపం, పాతగుట్టలో నిర్వహించిన శ్రీసత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు మొక్కుపూజలు చేశారు. వేకువజామున్నే భక్తులు దీపారాధాన చేపట్టి, స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
తాజావార్తలు
- ఆస్తి తగాదాల్లో అన్నపై తమ్ముడు కత్తితో దాడి
- పవన్ మాట మార్చలేదు.. శివరాత్రికే తీపికబురు
- IPL vs సినిమాలు.. సమ్మర్ లో రచ్చ రంబోలా
- ఎల్ఐసీ టార్గెట్ ఇదే: ఐపీవో ద్వారా రూ.25 వేల కోట్ల పెట్టుబడి సేకరణ!
- నాగార్జున ‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ అప్డేట్
- వాణీదేవి గెలుపుకోసం కలిసికట్టుగా కృషి చేయాలి
- బ్యాంకుల జోరు:టాప్10 కంపెనీల ఎంక్యాప్ రూ.5.13 లక్షల కోట్లు రైజ్
- వైరల్ అవుతున్న చిరంజీవి ఆచార్య లొకేషన్ పిక్స్
- రేపటి నుంచి మలి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
- పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం : మంత్రి సత్యవతి రాథోడ్
MOST READ
TRENDING