నల్లగొండ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిని ప్రియుడు బీరు సీసాతో పొడిచి కిరాతకంగా హతమార్చిన సంఘటన జిల్లాలోని నాగార్జున సాగర్లోని శివం హోటల్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మద్యం మత్తులో ప్రియురాలు చందనను ప్రియుడు శంకర్ బీరు సీసాతో పొడిచి చంపాడు. ప్రియురాలు పెండ్లికి నిరాకరించడంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సమాచారం. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
షాపు తెరిచినందుకు రూ.3 వేల జరిమానా
అనంతగిరిలో కొవిడ్ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తాం
రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన మంత్రి అల్లోల
బావిలోంచి బాలుడి మృతదేహం వెలికితీత
సుందర్ లాల్ బహుగుణ మృతి పట్ల మంత్రి ఐకే రెడ్డి సంతాపం