హుజూరాబాద్ టౌన్, జూన్ 25: కరీంనగర్ జిల్లా ట్రస్మా అధ్యక్షుడు, హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన కోరెం సంజీవరెడ్డి శుక్రవారం ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. సిద్దిపేటలో జరిగిన ట్రస్మా నాయకుల సమావేశంలో మంత్రి హరీశ్రావు.. టెట్రా విద్యాసంస్థల అధిపతి కోరం సంజీవరెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 15 ఏళ్లుగా ప్రైవేట్ పాఠశాలల సంఘం (ట్రస్మా) నాయకుడిగా పనిచేసి పాఠశాలల, ఉపాధ్యాయుల సమస్యలను ఆయన పరిషరించారు. ఆయన సేవలకు గుర్తింపుగా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఆయన్ను పలుమార్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంజీవరెడ్డికి టీఆర్ఎస్లో సముచిత స్థానాన్ని కల్పిస్తామన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా సంజీవరెడ్డికి అవకాశం కల్పించాలని రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు మంత్రి హరీశ్రావును కోరగా ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర నాయకులు పరంజ్యోతి శ్రీపాల్ రెడ్డి, హుజూరాబాద్ నియోజకవర్గ ట్రస్మా నాయకులు తదితరులు పాల్గొన్నారు.