ఆదిలాబాద్ : జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురువాలని గురువారం కప్పతల్లి (బుడ్ బావేయ్) ఆటలు ఆడారు. ప్రతి యేటా మే నెల తర్వాత వచ్చే అమావాస్య రోజున ఆదివాసులు ఈ ఆట ఆడుతారు. బోథ్ మండలం పారి(కే), సిరికొండ మండలం రిమ్మ గ్రామంలో గిరిజన చిన్నారులు ఒక కరకు కప్పలను కట్టి ఇంటింటికీ తిరుగుతూ గిరిజన సంప్రదాయ నృత్యాలు చేశారు. మహిళలు హారతి పట్టి, కప్పకు, చిన్నారులకు స్నానం చేయించారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని బుడ్ బావేయ్ పండుగను నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
చిన్నారి గుండెకు అండగా ఎమ్మెల్యే మర్రి
ప్రజా సేవలో పోలీసులు అంకితం కావాలి
మెడికల్ హబ్గా మహబూబాబాద్ : మంత్రి సత్యవతి
వరద నీటిని సద్వినియోగం చేసుకోవాలి
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : మంత్రి పువ్వాడ