కామారెడ్డి : జిల్లాలోని జుక్కల్ మండలంలో గల కౌలాస్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి వేశారు. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో గల కౌలాస్ ప్రాజెక్టు గేట్లను ఇరిగేషన్ అధికారులు ఎత్తివేశారు. మహారాష్ట్రలో భారీ వానలతో కౌలాస్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కౌలాస్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ నుంచి దిగువకు దాదాపు వెయ్యి క్యూసెక్కుల వరదను అధికారులు కిందకు పంపిస్తున్నారు.